వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవు సాయంపై ప్రధానికి వై.ఎస్‌. లేఖ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కరవు కోరల్లో చిక్కి అల్లాడుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రజలను సత్వరం ఆదుకోవాలని సి.ఎల్‌.పి. నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి గురువారం ప్రధాని వాజ్‌ పేయికి లేఖ రాశారు. కరవు తీవ్రంగా వున్న మండలాలను ఆదుకొనేందుకు మండలానికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరామన్నారు. ఆయితే ప్రభుత్వం ప్రకటించిన కనీస మొత్తం నిధులు కూడా ఇంతవరకు ప్రజలకు అందలేదని వై.ఎస్‌. విమర్శించారు.
కరవు తీవ్రంగా వున్న రాష్ట్రంలోవిద్యుత్‌ బకాయిల వసూలును నిలిపివేయాలని, రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని, పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 1500 రూపాయలుఅందచేయాలని, కరవు ప్రాంతాలలో విద్యార్థులకుఫీజులు మాఫీ చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించాల్సిందిగా ప్రధానికి రాసిన లేఖలో కోరినట్లు వై.ఎస్‌. చెప్పారు. కరవు సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని వై.ఎస్‌.విమర్శించారు. కరవు పీడిత ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మూడు వారాలయినా ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదని వై.ఎస్‌. దుయ్యబట్టారు.

  • సాయంకోసం బాబు ఢిల్లీ యాత్ర
  • సాయంపై పెదవి విప్పని కేంద్రబృందం
  • కరవు బృందానికి కన్నీటి స్వాగతం
  • కరవుబృందాన్ని నిలదీసిన రైతులు
  • వచ్చే వారం కరవు నివేదిక
  • వెయ్యికోట్లకు లెఫ్ట్‌ డిమాండ్‌
  • కరవు మండలాలకు బాబు ప్యాకేజ్‌
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X