వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా పంద్రాగస్టువేడుకలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమైన కేంద్రాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి సందేశాలను ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పతాకావిష్కరణ చేశారు.

సామాజిక న్యాయంకోసం ప్రతికార్యకర్త పాటుపడాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎన్‌టిఆర్‌ ఆశయాలసాధనకు పార్టీ పునరాంకితమవుతున్నదని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ముఖ్యులు, మంత్రులుహాజరయ్యారు. కాగా గాంధీభవన్‌లో జరిగిన వేడుకలో పిసిసి నేత సత్యనారాయణరావు జెండా ఎగురవేశారు. మతతత్త్వ శక్తుల చేతిల్లో దేశం తిరోగమనం పాలవుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశాన్ని మతవాదుల చేతుల్లోంచివిముక్తం చేసేందుకు ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త తనవంతు కృషి చేయాలని ఆయనకోరారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌, ఎన్‌ జనార్ధన్‌రెడ్డి తదితరులుహాజరయ్యారు. కాగా బిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకలో పార్టీ నేత చిలక పతాకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిధిగాహాజరయ్యారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వంటి ప్రధాన కేంద్రాల్లో కూడా ఉత్సవాలు వేడుకగా జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X