ప్రధాని ప్రసంగం పాతపాటే
న్యూఢిల్లీః
ప్రధాని
వాజ్పేయి
స్వాతంత్ర్య
దినోత్సవం
సందర్భంగా
ఎర్రకోటనుంచి
ప్రజలనుద్దేశించి
చేసిన
ప్రసంగంపై
ప్రతిపక్షాలు
పెదవి
విరిచాయి.
ప్రసంగంలో
కొత్తదనం
లేదని
ప్రతిపక్షాలు
పేర్కొన్నాయి.
దేశం
ఎదుర్కుంటున్న
ప్రధాన
సమస్యల
ఊసే
ఈ
ప్రసంగంలో
లేదని
ప్రతిపక్షాలు
దుయ్యబట్టాయి.
తమ ప్రభుత్వం పై వస్తున్నవిమర్శలకు సమాధానంలా మాత్రమే ప్రధాని ప్రసంగం వున్నదని కాంగ్రెస్ ప్రతినిధి జయపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. వాజ్పేయి ప్రసంగంలో వుండే సహజమైనవిరుపులు, గాంభీర్యం, సమస్యలపై ఫోకస్ ఈ ప్రసంగంలో లేవని ఆయన అన్నారు. చెప్పిందేచెప్పుతూ ప్రధాని బోర్ కొట్టించారని ఆయన అన్నారు. ప్రసంగం ఏమాత్రం స్ఫూర్తి దాయకంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సిపిఎం నేత సోమనాథ్ ఛటర్జీ కూడా ప్రధాని ప్రసంగంపైపెదవి విరిచారు.
ఎర్రకోట నుంచి ప్రధాని సుమారు 35 నిమిషాల పాటు ప్రసంగించారు. ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధానులు ఎవరూ ఇంత తక్కువ వ్యవధి ప్రసంగం చేయలేదని పరిశీలకులుఅంటున్నారు. ప్రధాని తమ ప్రసంగంలో ఆగ్రా శిఖరాగ్ర వైఫల్యం,పేద, గ్రామీణ ప్రజల అభివృద్ధి వంటి అనేకవిషయాలను ప్రస్తావించారు.
ఆగ్రా శిఖరాగ్ర సదస్సు వైఫల్యానికి బాధ్యత ముషారఫ్దే నని ప్రధాని పేర్కొనడాన్ని జయపాల్, సోమనాథ్ చటర్జీ ఖండించారు. ముషారఫ్ కాశ్మీర్ గురించి కాకుండా తాజ్మహల్ను గురించి మాట్లాడాల్సిందని ప్రధాని ఏవిధంగా ఆశించగలరని వారు వ్యంగ్యంగా ప్రశ్నించారు. చర్విత చరణంగా చెప్పిందే చెప్పకుండా కొత్తవిషయాలపై ప్రధాని దృష్టి సారించడం మంచిదని వారు సలహా ఇచ్చారు. కాశ్మీర్ పై ప్రధాని ప్రస్తావనలు సమర్ధించుకునే ప్రయత్నంలా కనిపించాయని జయపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.