వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పింగళి వారసులకు సాయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః జాతీయ పతాక రూపశిల్పి పింగళివెంకయ్య వారసులను ఉదారంగా ఆదుకోనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దుర్భర దారిద్ర్యంలో మగ్గుతునే దేశంకోసం పోరాటంలో పాల్గొన్న పింగళి వెంకయ్య మహాత్ముని సలహాపై జాతీయ పతాకాన్ని రూపొందించిన విషయం విదితమే.

ఈ జెండా ఈ నాడు భారతస్వాతంత్ర్య సంగ్రామంలో వేలాది మంది యోధులకు పోరాట స్ఫూర్తిగా నిలిచింది. నేడు భారతీయల్లో జాతీయఅభిమానం, , సమైక్య భారతీయ భావనకుఈ జెండా నిలువెత్తు ప్రతీకగా నిలుస్తున్నది

జాతీకి ఇంతటి మహత్తర కానుకనుఅందించిన వెంకయ్య జీవితమంతా దుర్భర దారిద్ర్యంలోనే గడిచింది. ఆయన వారసులకు కూడా అదే వారసత్వం లభించింది. దేశ 55స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పత్రికల్లోఈ విషయంపై వచ్చిన వార్తలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంకయ్య వారసులకు గృహవసతి కల్పించనున్నట్టుగా పెన్షన్‌ మంజూరు చేయనున్నట్టుగా ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X