తమిళనాడులో పేలుడు-27 మంది మృతి
చెన్నై: తమిళనాడు పారిశ్రామిక పేలుడు పదార్థాల లిమిటెడ్ కర్మాగారంలో జరిగినఘోర ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం సంభవించినప్పుడు కర్మాగారంలో 30 మంది విధుల్లో వున్నారు. పేలుడు పదార్థాలు తయారు చేసే గోడవున్లో ఈఘోర ప్రమాదం సంభవించింది. చెన్నైకి 110 కిలోమీటర్ల దూరంలో గల కాట్పాడి వద్ద గల టిఐఇఎల్ వుంది. ఈ పేలుడు గురువారం ఉదయం తొమ్మిదన్నర గంటల ప్రాంతంలో జరిగింది. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఈ పేలుడుకు కర్మాగారంపైకప్పు కుప్పకూలింది.
కంపెనీ చైర్మన్తో పాటు ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయడానికి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికె. పాండురంగన్ను, పరిశ్రమల మంత్రి ఆర్. వైథిలింగంను ప్రమాద స్థలానికి పంపినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు.
మరణించినవారి
కుటుంబానికి
50
వేల
రూపాయలేసిఎక్స్గ్రేషియాను,
తీవ్రంగా
గాయపడిన
వారికి
15
వేల
రూపాయలేసి,
మామూలుగా
గాయపడినవారికి
ఆరు
వేల
రూపాయలేసిఎక్స్గ్రేషియా
ఇవ్వనున్నట్లు
ఆమె
తెలిపారు.