వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓర్వలేక దేశం దాడులు
హైదరాబాద్ః స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో ఓటిమిని భరించలేక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల పై పనిగట్టుకుని దాడులకు పాల్పడుతున్నదని పిసిసినేత సత్యనారాయణరావు ఆరోపించారు.
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ, ఓటమితోఅసహనానికి లోనైన తెలుగుదేశం పార్టీ పాశవిక దాడులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అనంతపురంలో తమ పార్టీ నేత సతీష్ హత్యకు నిరసనగా ఈ నెల 25నపెద్దఎత్తున సభ నిర్వహించనున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ సభుపెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఇదిలా వుండగా సతీష్ హత్యకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గురువారం నాడ జరిగిన అనంతబంద్ ప్రశాంతంగా జరిగింది. అవాంఛనీయ సంఘటనలుపెద్దగా జరగలేదు.
Comments
Story first published: Thursday, August 16, 2001, 23:53 [IST]