వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌పై రాజీ సమస్యే లేదు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత్‌ పాకిస్తాన్‌ ద్వైపాక్షిక సంబంధాలపై పాకిస్తాన్‌ అధినేత ముషారఫ్‌తో ఆగ్రాలో జరిగిన చర్చల సందర్భంగా కాశ్మీర్‌ ప్రస్తావన వచ్చిందని ప్రధాని వాజ్‌పేయి చెప్పారు. కాశ్మీర్‌ ఊసులేకుండా ఎలా వుంటుందని ఆయన ప్రశ్నించారు. ఆగ్రా శిఖరాగ్రంపై జరిగిన చర్చకు ఆయన గురువారం నాడు రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.ఆగ్రాలో కాశ్మీర్‌ ఊసే తాము ఎత్తలేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఆయనఖండించారు. కాశ్మీర్‌ విషయంలో భారత్‌ రాజీ పడే సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు. పాక్‌తో భవిష్యత్తులో చర్చలకు విస్తృత పరిథిలో ప్రణాళికను ఖరారు చేసినట్టుగా చెప్పారు.

కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని కాశ్మీర్‌కు సంబంధించి పాకిస్తాన్‌తో ఏమేరకు ప్రస్తావించాలో ఆమేరకు మాత్రమే భారత్‌ ప్రస్తావించిందని ఆయన చెప్పారు. ఆగ్రాలో కాశ్మీర్‌ ఊసులేదన్న భావనను ప్రతిపక్షాలు తమ మనసుల్లోంచి తొలిగించాలని ఆయన హితువు చెప్పారు. సీమాంతర ఉగ్రవాదంవిషయంలో పాకిస్తాన్‌ను భారత్‌ గట్టిగానే హెచ్చరించిందని ఆయన చెప్పారు.

ద్వైపాక్షిస సంబంధాలు, ఉపఖండంలో శాంతికంటే పాకిస్తాన్‌స్వప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని ఆయనవిమర్శించారు. పాకిస్తాన్‌లో సైనికపాలనను కూడా తాము వ్యతిరేకించామని అయితే త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా చెప్పడంతో హర్షం వ్యక్తం చేశామని ఆయనవివరించారు. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్‌ ఊసెత్తమని పాక్‌ తమకు హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X