వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్‌ ఒప్పందాల్లో ముడుపులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో ఏర్పాటు చేస్తున్న ఆరు విద్యుత్‌ ప్రాజెక్టులకు ఆర్ధిక సంస్ధలనుంచి రుణాలు మంజూరు చేయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రత్యేక చొరవకు కారణాలను వివరించాలని ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్‌, సిపిఎం డిమాండ్‌ చేశారు.

ఈ ప్రైవేట్‌ సంస్థలకు దన్నుగా ముఖ్యమంత్రి ఆర్ధిక సంస్థలను రుణాల మంజూరుకు ఒప్పించడంలో ముడుపులు చేతులు మారాయన్న అనుమానం ఈ రెండు పార్టీలు వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్య ఢిల్లీ వెళ్లినప్పుడు ఐడిబిఐ, పిఎఫ్‌సి సంస్థలతో చర్చించి ఎస్క్రూఅకౌంట్‌ అక్కరలేకుండానే ఈ ఆరు ప్రాజెక్టులకు రుణాలు మంజూరు చేసేవిధంగా ఆర్ధిక సంస్ధలను ఒప్పించారని పిసిసి ప్రతినిధి రోశయ్యపేర్కొన్నారు.

దీనిపైవిచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. యుటిఐ 32 కోట్ల కుంభకోణంపై విరుచుకుపడుతున్న పార్లమెంట్‌ ఈ భారీ కుంభకోణంపై కూడా దృష్టి సారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిపిఎం నేత రాఘవులు కూడా చంద్రబాబు చొరవకు రాష్ట్ర ప్రయోజనలనుమించిన కారణాలున్నాయన్న అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికివిద్యుత్‌ అవసరం ఎంతవున్నా ఈ విధంగా ప్రైవేట్‌ సంస్థల ప్రయోజనాలకు ముఖ్యమంత్రి కొమ్ముకాయడం పట్ల కాంగ్రెస్‌, సిపిఎం తీవ్ర అభ్యంతరం చెప్పాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X