వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షకీల్ హత్య నిజం కాదు
ముంబాయిఃముంబాయి నేరసామ్రాజ్యాన్ని ఎదురులేకుండా ఏలుతున్నదావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు ఛోటాషకీల్ దారుణహత్యకు సంబంధించి వెలువడినవార్తలు ఉత్త వదంతులు మాత్రమేనని వెల్లడయింది.సింగపూర్నుంచి ఛోటా షకీల్ స్వయంగా ఒక ప్రైవేట్ టివి చానెల్కు ఫోన్ చేసి తాను క్షేమంగా వున్నట్టుగా చెప్పారని తెలిసింది.
తాను హత్యకుగురైనట్టుగా పనిగట్టుకుని ప్రచారం చేసినవారెవ్వరో తనకు తెలియదని కూడా షకీల్ చెప్పినట్టు తెలిసింది. తనతో పాటు దావూద్ కూడా క్షేమమని షకీల్ ప్రకటించినట్టుగా తెలిసింది. ఇదిలా వుండగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా షకీల్ హత్య వార్త అబద్దమని ఇంటలీజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ప్రకటించింది.
కరాచిలో ఛోటా షకీల్ హతం
Comments
Story first published: Sunday, August 19, 2001, 23:53 [IST]