వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఖరు అంకానికి రంగం సిద్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఆఖరు ఘట్టం సోమవారంతో పూర్తవుతుంది. సోమవారం నాడు 22 జిల్లాల్లోని 27 డివిజన్లలో వున్న ఏడువేల పై చిలుకు గ్రామాల్లో మూడోవిడత పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

గత రెండువిడతల పోలింగ్‌లో 14 వేల మంది సర్పంచ్‌లను ఎన్నుకున్న ప్రజలు ఈ విడతలో మరో ఏడువేల మందిని ఎన్నుకుంటారు. తొలిరెండు విడత అనుభవాల దృష్ట్యా ఫాక్షన్‌ గ్రామాల్లో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లోపెద్దఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఫాక్షనిస్టు నేతలను పలువురిని ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆఖరుఅంకంలో పెద్దఎత్తున హింసకు అవకాశం వున్నదన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తున్నది. అనంతపురం జిల్లాలోనే కాంగ్రెస్‌ నాయకుని హత్య జరగడం వల్ల దీనిప్రభావం పోలింగ్‌ సమయంలో వుండే అవకాశం వున్నదన్న భయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం నాడు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్‌ జరుగుతుందని ఆ తర్వాత వెంటనే కౌంటింగ్‌ ప్రారభమవుతుందని అధికారులు చెప్పారు. తొలిరెండువిడతల్లో హింసాకాండ, అల్లర్లు చెలరేగినప్పటికీ పోలింగ్‌ సజావుగానే సాగింది. ఆఖరుఅంకం కూడా సవ్యంగా సాగితే అధికార యంత్రాంగం హాయిగా ఊపిరిపీల్చుకుంటుంది. మూడునెలల క్రితం జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలతో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికలు సోమవారంతో ముగుస్తాయి. దాదాపు మూడునెలల నుంచి రాష్ట్రంలోని ప్రతిపలెల్లో ఈ ఎన్నికల హడావుడి కనిపిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X