వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిసిసి కార్యవర్గానికి తుదిమెరుగులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఏడాది కాలంగా నానుతూ వస్తున్న పిసిసి కార్యవర్గం నియామకం మరికొద్దిరోజుల్లో ఖరారవుతుందని పిసిసినేత సత్యనారాయణరావు చెప్పారు. మంగళవారంనాడు ఆయన కొత్తకార్యవర్గం జాబితాకు తుదిమెరుగులు దిద్దేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లుతున్నారు.

అనంతలో ఈ నెల 25న తలపెట్టిన సభ తర్వాత ఢిల్లీ వెళ్లాలని తొలుత అనుకున్నప్పటికీ అధిష్టానం పిలుపుపై ఆయన మంగళవారంనాడే ఢిల్లీ వెళ్లుతున్నారు. జిల్లా, నగర కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల జాబితాను ఆయన ఖరారు చేసుకుని తీసుకువస్తారనిఅంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించినవిజయాల దృష్ట్యా అధిష్టానం వద్ద ఆయన పలుకుబడు గణనీయంగాపెరిగిందని అంటున్నారు. అందువల్ల ఆయన మునుపటికంటేస్వతంత్రంగా వ్యవహరించే అవకాశాలు వున్నాయి. కొత్త కార్యవర్గం ఖరారులో కూడా ఆయన ముద్ర వుండే అవకాశం వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X