వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రధాని సమర్ధన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ను ప్రధాని వాజ్‌పేయి మరోసారి గట్టిగా వెనకేసుకువచ్చారు. దేశీయ మీడియా క్రిస్టియన్‌ మిషనరీలపై చూపిస్తున్న ప్రేమలో నూరోవంతు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ పై చూపడం లేదని ఆయన దుయ్యబట్టారు.

మిషనిరీలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు మతమార్పిడులే కారణమని ఆయన చెప్పారు. సంఘపరివార్‌ దేశాన్ని సంఘటితం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని శనివారం నాడు తనను కలిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేతల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని కితాబునిచ్చారు.

ఇదిలా వుండగా పాకిస్తాన్‌ అధ్యక్షుడు భారత్‌ ఆతిధ్యాన్ని దుర్వినియోం చేశారని ఆయన్ను పిలవడం తప్పయిందని అనుకునే పరిస్థితి కల్పించారని కూడా ప్రధాని వాజ్‌పేయి వ్యాఖ్యానించారు. అతిథేయ దేశం భారత్‌ మనోభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఆయన హురియత్‌తో సమావేశం కావడం, ఎడిటర్స్‌ సమావేశంలో ప్రసంగించడంపై వాజ్‌పేయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X