కరాచిలో ఛోటా షకీల్ హతం
ముంబాయిఃముంబాయి డాన్ దావూద్ ఇబ్రహిం కుడిభుజం, ముంబాయి పోలీసులు అనేక నేరాల్లో వెతుకుతున్న మాఫియా ముఠానేత చోటా షకీల్ పాకిస్తాన్లోని కరాచిలో దారుణ హత్యకు గురైనట్టుగా తెలిసింది.
ఛోటా షకీల్ తనబాస్ ఇబ్రహింతో కలసి కరాచిలో కారులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బాంబులతో దాడులు జరిపారని ఆ తర్వాత అతిదగ్గరనుంచి కాల్పులు జరిపారని పాకిస్తాన్ పత్రిక డాన్ వెల్లడించింది. ఈ సంఘటనలో ఛోటా షకీల్ అలియాస్ షకీల్ మహమ్మద్ అక్కడిక్కడే మరణించగా దావుద్ ఇబ్రహిం తీవ్రంగా గాయపడినట్టుగా పత్రిక వెల్లడించింది. షకీల్ మరో అనుచరుడు సయీమ్ మహమ్మద్ కూడా ఈ సంఘటనలో మరణించినట్టుగా తెలిసింది.
ముంబాయిలో అనేక క్రిమినల్ కేసుల్లో ఛోటా షకీల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం గ్యాంగులోనే పనిచేసిన ఇజాజ్ పఠాన్ ఈ హత్యలకు కారణమని చెబుతున్నారు. కొద్ది కాలం క్రితం ఛోటా షకీల్ చేసిన హత్యా ప్రయత్నంనుంచి ప్రాణాలతో బయటపడిన ముంబాయి మాఫియాముఠా నేత ఛోటా రాజన్ హస్తం ఈ హత్యల వెనక వున్నదనిఅంటున్నారు. ఇజాజ్ సాయంతో రాజన్ ఈ హత్యలకు పథకం పన్నారనిఅంటున్నారు.
షకీల్
హత్యతో
దావూద్
ఇబ్రహిం
బలంఘోరంగా
దెబ్బతిన్నట్టే
నని
అంటున్నారు.
షకీల్
తనకు
తోబుట్టువుకంటే
ఎక్కువని
ఆయన్ను
ముట్టుకున్నా
తాను
సహించనని
కొద్దిరోజుల
క్రితమే
దావూద్
ప్రకటించారు.
ఇబ్రహింను
కూడా
ప్రస్తుతం
ఆస్పత్రిలో
చేర్చారని
చెబుతున్నారు.
షకీల్
హత్యను
ముంబాయి
పోలీసులు
మాత్రం
ఇంకాధృవీకరించలేదు.
ముంబాయిలో
రెడ్
అలర్ట్
ముంబాయిలో
పోలీసులు
రెడ్
అలర్ట్
ప్రకటించారు.
ఛోటా
షకీల్
హత్యకు
సంబంధించిన
వార్తలు
ఇంకా
ధృవపడనప్పటికీ
దీని
ప్రభావం
ముంబాయి
నేరసామ్రాజ్యంపై
తీవ్రంగా
వుంటుందని
పోలీసులు
అనుమానిస్తున్నారు.