వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాసుమతికి తిలోదకం-లోక్‌ సభ ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః బాసుమతి బియ్యంపేటెంట్‌ హక్కులను అమెరికాకు చెందిన ఓ కంపెనీ చేజిక్కించుకోవడంపై లోక్‌ సభలో మంగళవారం దుమారం చెలరేగింది.పేటెంట్‌ హక్కులను న్యాయస్థానం ద్వారో అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఎగరేసుకుపోతుంటే ప్రభుత్వం ఎలా చూస్తూ ఊరుకున్నదని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రతిపక్షాలవిమర్శలు, అధికార పక్ష సభ్యుల ప్రతి విమర్శలతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లుస్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి ప్రకటించారు.

అంతకు ముందు సభ ప్రారంభం కాగానే బాసుమతి బియ్యంపేటెంట్‌ ను అమెరికాకు చెందిన కంపెనీ చేజిక్కించుకున్నదంటూ వచ్చిన వార్తాపత్రికల కటింగ్‌ లను చూపుతూ ప్రతిపక్షాలు సర్కార్‌ పై దాడి ప్రారంభించాయి. భారత దేశంలోని రైతుల ప్రయోజనాలకు ఈ పరిణామం వల్ల తీవ్ర విఘాతం కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు.స్పీకర్‌ విజ్ఞప్తులను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆరుపులు, కేకలు వేయడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లుస్పీకర్‌ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X