ముఠాతగాదాలపై సభాసంఘం
హైదరాబాద్: రాష్ట్రంలో ఫ్యాక్షనిజంఅంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు శాసనసభస్పీకర్ కె. ప్రతిభాభారతి సభా సంఘాన్ని నియమించారు. సభా సంఘం నియామకం గురించి, సభా సంఘం పరిధిలో చేర్చాల్సినఅంశాల గురించి చర్చించేందుకు ఆమె మంగళవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభా సంఘం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్రంలోని ముఠా తాగాదాలను రూపు మాపేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేస్తుంది. మూడు నెలల్లో ఈ సంఘం తన నివేదికను సమర్పిస్తుంది.
ముఠా
తగాదాలకు
కారణమైన
సామాజిక,
రాజకీయఅంశాలను
ఈ
సంఘం
అధ్యయనం
చేస్తుంది.
ఈ
తగాదాలను
రూపుమాపడానికి
పాలనాపరంగా,
న్యాయపరంగా,
చట్టపరంగా
తీసుకోవాల్సిన
చర్యల
గురించి
సూచనలు
చేస్తుంది.
రాజకీయాలకు,
ఫ్యాక్షనిజానికి
మధ్య
గల
సంబంధంపై
కూడా
ఈ
సంఘం
అధ్యయనం
చేస్తుంది.
ఇతర
రాష్ట్రాల్లో
పర్యటించి
సభా
సంఘంసిఫార్సులు
చేస్తుంది.
తెలుగుదేశం
శాసనసభ్యుడు
గౌతు
శ్యాంసుందర
శివాజీ
అధ్యక్షతన
18
మంది
శాసనసభ్యులతో
సభా
సంఘం
ఏర్పాటయింది.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షనిజం లోతుగా పాతుకుని పోయిందని, మరి కొన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోందని,అందువల్ల దీన్ని వదిలేయడం మంచిది కాదనే ఉద్దేశంతో ఫ్యాక్షనిజంఅంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు కమిటీ అవసరమని ప్రభుత్వం భావించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
ప్రజా
ప్రతినిధులకు
రక్షణ
కల్పించే
బాధ్యతపై
అధ్యయనం
చేసేఅంశాన్ని
కూడా
సభా
సంఘం
పరిధిలో
చేర్చాలని
కాంగ్రెస్
కోరింది.