హార్డ్వేర్పై ఆంధ్ర ప్రత్యేక విధానం
హైదరాబాద్ః గత కొన్ని సంవత్సరాలుగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంపై ప్రత్యేక శ్రద్ధచూపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు హార్డ్వేర్ రంగం అభివృద్ధికి కూడా చర్యలు ప్రారంభించింది. హార్డ్వేర్ రంగానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ప్రత్యేక విధానాన్ని ఆవిష్కరించనున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సిఐఐ సారథ్యంలో అడ్వాంటేజ్ హార్డ్వేర్ పేరుతో ఈ నెల 25,26 తేదీల్లో జరుగనున్న రెండు రోజుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కొత్త విధానాన్ని ఆవిష్కరించే అవకాశం వున్నదని అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం సాఫ్ట్వేర్ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత హార్డ్వేర్ రంగానికి ఇవ్వడం లేదని పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కో కన్వీనర్గా ఏర్పాయిన జాతీయ టాస్క్ఫోర్స్ కూడా సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధికే ఎక్కువగా సిఫారసులు చేసిందని ఆ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాఫ్ట్వేర్కు దీటుగా హార్డ్వేర్ రంగం అభివృద్ధికోసం సన్నాహాలు ప్రారంభించింది.