వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ లక్ష్యం 264- 55/1

By Staff
|
Google Oneindia TeluguNews

గాలెః శ్రీలంకతో జరుగుతున్న రెండోటెస్ట్‌ మూడో రోజున భారత్‌ మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది. వెంకటేష ప్రసాద్‌ చక్కగా బౌలింగ్‌ చేసి 5వికెట్లు సాధించాడు. జహీర్‌ ఖాన్‌ విజృంభించి నాలుగువికెట్లు తీసుకోవడంతో భారత్‌ శ్రీలంకను చాలావరకు కట్టడి చేయగలిగింది. అయితే స్పిన్‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ బ్యాట్‌ ఝుళిపిస్తూ భారత్‌ కెప్టెన్‌ కు ముచ్చెమటలు పూయించాడు. మురళి తనటెస్ట్‌ కెరీర్‌ లో అత్యథికంగా 67 పరుగులు చేశాడు. మూడుసిక్సర్లు, ఐదు ఫోర్లతో మురళి గాలె ప్రేక్షకుల్ని రంజింప చేశాడు. 200 పరుగుల లోపు లక్ష్యం వుంటుందనుకున్న భారత్‌ కెప్టెన్‌ ఆశలు అడియాసలు చేశాడు.

ఇంకా రెండు రోజుల ఆటమిగిలి వుండగా 264 పరుగుల స్కోరు సాధించడం భారత్‌ కు అంత తేలిక కాదనే చెప్పుకోవాలి. శ్రీలంక 2వ ఇన్నింగ్స్‌ లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి ముత్తయ్య మురళీధరన్‌ కావడంవిశేషం. ఎంతమంది బౌలర్లను మార్చినప్పటికీ ఫలితం లేక మురళిని అవుట్‌ చేసేందుకు గంగూలీ నానా తంటాలు పడ్డాడు. చివరకు హర్భజన్‌ బౌలింగ్‌లో మురళి అవుటయ్యాడు.

భారత జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒకవికెట్‌ నష్టపోయి 55 పరుగులు చేసింది. శివసుందర్‌ దాస్‌ మురళీథరన్‌ బౌలింగ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత రాహుల్‌ ద్రావిడ్‌ బ్యాటింగ్‌కు దిగాడు. ఆట ముగిసే సమయానికి ద్రావిడ్‌ 11 పరుగులతోనూ, రమేష్‌ 15 పరుగులతోనూ క్రీజ్‌లో వున్నారు. భారత్‌ శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించడానికి ఇంకా 209 పరుగులు చేయాల్సి వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X