మా వాడికే పాపమూ తెలియదు
హైదరాబాద్ః కృషి బ్యాంకుతో తన కుమారుడు సత్యనారాయణకు ఏ సంబంధం లేదని రాష్ట్ర డిజిపి హెచ్జె దొర స్పష్టం చేశారు. కృషి బ్యాంకు చైర్మన్ వెంకటేశ్వరరావు ప్రమోట్ చేసిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మూడు నెలల పాటు పనిచేయడం మినహా ఆ సంస్థలతో తమవాడికే సంబంధం లేదని ఆయన విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చుకున్నారు.
డిపాజిటర్ల నెత్తిన శఠగోపంపెట్టి పరారీలో వున్న కృషి చైర్మన్ వెంకటేశ్వరరావుకు ప్రముఖ ఐపిఎస్ అధికారితో సన్నిహిత సంబంధాలు వున్నాయన్న వార్తల నేపథ్యంలో దొరవివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో ఈ మధ్య ముగిసిన పంచాయతీ సమరం శాంతియుతంగా ముగిసిందని చెప్పడానికి పోలీసు శాఖ ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో కొందరు విలేకరులు హఠాత్తుగా డిజిపి కుమారుని వ్యవహారం ప్రస్తావించేసరికి దొర తొలుత కొద్దిగా తడబడ్డారు.
ఆ తర్వాత తేరుకుని కృషి వార్తల్లోకి రాకముందు తన కుమారుడు వెంకటేశ్వరరావుకు చెందిన ఒక పాఫ్ట్వేర్ కంపెనీలో జీతభత్యాలు తీసుకోకుండా పనిచేశారని ఆ తర్వాత ఆ సంస్థను వదిలివేసి జిఇ కంట్రీవైడ్ఫైనాన్స్లో చేరారని డిజిపి వివరణ ఇచ్చారు.
కృషి
బ్యాంకు
వ్యవహారంలో
నిందితులను
పట్టుకుని
డిపాజిటర్లకు
న్యాయం
చేసేవిషయంలో
పోలీసు
శాఖ
పట్టుదలగా
వున్నదని
ఎలాంటి
వత్తిళ్లకు
తలవొగ్గే
సవాలే
లేదని
ఆయన
చెప్పారు.
పరారీలో
వున్న
కృషి
బ్యాంకు
చైర్మన్
వెంకటేశ్వరరావు,
మరో
పదిమంది
డైరెక్టర్ల
ఆచూకీ
కనిపెట్టి
వారినిఅరెస్ట్
చేసేందుకు
వీలుగా
రాష్ట్ర
పోలీసు
శాఖ
పది
ప్రత్యేక
బృందాలను
ఏర్పాటు
చేసింది.
ఈ
బృందాలు
దేశంలో
ఏ
మూల
వున్నా
కృషి
బృందాన్ని
పట్టి
బంధిస్తాయి.