వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండ ప్రజలకు ఊరటనిచ్చే తీర్పు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్‌ పీడిత గ్రామాలకు ఊరటనిచ్చే తీర్పును హైకోర్టు శుక్రవారం వెలువరించింది. సుభాష్‌ చంద్రన్‌ అనే వ్యక్తి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు చెప్పింది.

నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్‌ పీడిత గ్రామాల ప్రజలకు ప్రభుత్వం తన ఖర్చుతో మంచినీరు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఫ్లోరోసిస్‌ పీడిత గ్రామాలను గుర్తించి, ఆ గ్రామాల ప్రజలకు తగిన వైద్య సహాయంఅందించాలని కూడా ఆదేశించింది. ఫ్లోరోసిస్‌ తీవ్రంగా గ్రామాల్లోని ప్రజలను ప్రభుత్వం తన ఖర్చుతో ఖాళీ చేయించి, వారికి మరో చోట

పునరావాసం కల్పించాలని కూడా హైకోర్టు సూచించింది. ఫ్లోరోసిస్‌ పీడిత గ్రామాల ప్రజల విషయంలో ఛటర్జీ కమిషన్‌ ఇచ్చిన సూచనలను పాటించాలని హైకోర్టు ప్రభుత్వాని ఆదేశించింది. నీటిలో ఫ్లోరోసిస్‌ అధికంగా వుండే బోర్‌వెల్స్‌ను మూసేయాలని కూడా కోర్టు సూచించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X