వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సర్కారు బళ్లలో టాటాల ఐటి పాఠాలు
హైదరాబాద్: ఐటి శిక్షణ, విద్యారంగంలోని టాటాఇన్పోటెక్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐటి విద్యను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నది. ప్రభుత్వం అనుమతిస్తే రెండు నెలల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ కోర్సులను ప్రవేశపెడతారు.
కోర్సులో చేరిన ప్రతి విద్యార్ధి నుంచి ప్రతినెలా 80 రూపాయలు వసూలు చేస్తారు. ఆరో తరగతి స్థాయి విద్యార్ధుల నుంచి ఈ ఐటి కోర్సులను ప్రారంభిస్తారు. హర్యానాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఈ కోర్సులను టాటా ఇన్ఫోటెక్ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు పంజాబ్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలను కూడా సంప్రదిస్తున్నట్టు టాటా ఇన్పో అధికారులు చెప్పారు.
Comments
Story first published: Friday, August 24, 2001, 23:53 [IST]