వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్వతితో కాకర్ల రాజీబేరం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః నిమ్స్‌ డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతితో రాజీ బేరానికి ప్రయత్నిస్తున్నారు. ఎ డాక్టర్‌ స్టోరీ ఆఫ్‌ లైఫ్‌ అండ్‌ డెత్‌ అనే పుస్తకం రాసిన కాకర్ల సుబ్బారావు ఎన్టీఆర్‌ మరణానికి లక్ష్మీపార్వతే కారణంఅంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాకర్ల వ్యాఖ్యలపై మండిపడిన లక్ష్మీపార్వతి ఆయనపై పరువునష్టం దావా తో పాటు క్రిమినల్‌ కేసులు దాఖలు చేసేందుకు కోర్టును ఆశ్రయించినవిషయం విదితమే.

ఈ వివాదాన్ని కోర్టు వెలుపలే పరిష్కరించుకొనేందుకు కాకర్ల శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిసింది.వివాదాస్పద వ్యాఖ్యలను పుస్తకం నుంచి తొలగించడంతో పాటు బేషరతుగా లక్ష్మీపార్వతికి క్షమాపణలు చెప్పేందుకు కూడా డాక్టర్‌ కాకర్ల సిద్ధపడినట్లు తెలిసింది. ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సోమరాజు కాకర్ల, లక్ష్మీపార్వతి మధ్య రాయబారం నడుపుతున్నారు.

సంతానం కోసం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ పై స్టెరాయిడ్‌ లు ప్రయోగించారని కూడా కాకర్ల తన పుస్తకంలోరాశారు. ఈ వ్యాఖ్యలు లక్ష్మీపార్వతికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. కాకర్ల రాజీ బేరానికి వచ్చినప్పటికీ కోర్టులో కేసు వేసే ప్రతిపాదనను లక్ష్మీపార్వతి ఉపసంహరించుకుంటారో లేదో వేచిచూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X