వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నాపర్ల అవతారంలో పోలీసులు!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్ర రాజధానిలో పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి సంచలనం సృష్టించారు. గురువారం నాడు ఆరుగంటల పాటు సాగిన ఈ హై డ్రామాను చివరకు పోలీసులే ఛేదించి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎస్‌.పి. భార్యను హైదరాబాద్‌ లో వుంటున్న మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అల్లుడు కృష్ణారావు రోజూ ఫోన్‌ లో వేధిస్తున్నాడు. దీనితో ఆగ్రహించిన ఆ ఎస్పీ పోలీసు బలగాలను హైదరాబాద్‌ పంపి కృష్ణారావును ఆయన ఇంటినుంచి కిడ్నాప్‌ చేశారు.

ఎవరో ఆగంతకులు తన యజమానిని కిడ్నాప్‌ చేశారని భావించిన కృష్ణారావుపి.ఎ. పంజగుట్ట పోలీస్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్‌ సమయంలో ఉపయోగించిన టాటాసుమో పోన్‌ నెంబర్‌ ను కూడా పోలీసులకుఅందించారు. నాలుగు గంటల పాటు నానాతంటాలు పడిఅంబర్‌ పేట సమీపంలో పోలీసులు ఆ టాటాసుమోను పట్టుకున్నారు. తీరా చూస్తేఅందులో మఫ్టీలో వున్న పోలీసులు కనిపించడంతో రాజధాని పోలీసులు అవాక్కయ్యారు. జరిగినవిషయాన్ని నగరపోలీస్‌ కమిషనర్‌ పేర్వారం రాములు గురువారం సాయంత్రంవిలేకరుల సమావేశంలో అసలు సంగతి వివరించారు.

కృష్ణారావు సెల్‌ ఫోన్‌ నుంచి ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎస్పీ భార్యకు కాల్స్‌ వచ్చేవి. అసభ్య పదజాలంతో వేధించే వారు. దీనితో ఆగ్రహం చెందిన ఎస్పీ కృష్ణారావును ఉత్తరాంధ్రకు తీసుకువెళ్ళిఅరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే రాజధాని పోలీసులుసరైన సమయంలో మేల్కొనడంతో ఉత్తరాంధ్ర పోలీసులు వట్టిచేతులతోనే వెనుదిరిగారు. రాజకీయన నాయకుడి బంధువైనంత మాత్రాన కృష్ణారావుపై చర్యతీసుకోకపోతే సహించేది లేదని ఆ ఎస్పీ పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X