వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిల్లాలవారీగా దేశం ఆత్మవిమర్శ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై తెలుగుదేశం పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటోంది. జిల్లాల వారీగా జరిగే ఈ ఆత్మవిమర్శ సమావేశాలు శుక్రవారం ఇక్కడ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు ఏడు గంటల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. గురువారంనాడు కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల నాయకుల సమావేశాలు జరిగాయి. పార్టీ పటిష్టతకు ఈ సమావేశాల్లో వ్యూహరచన చేస్తున్నారు.

పార్టీలో సమన్వయ లోపం చోటు చేసుకుందా, ప్రజల మనోభావాల్లో మార్పు వచ్చిందా అనేఅంశాలపై ఈ సమావేశాల్లో చర్చ జరుగుతోందని తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లువిలేకరులతో చెప్పారు. పార్టీని సమిష్టిగా ముందుకు తీసుకోవడానికి తగిన కార్యక్రమాలను ఈ సమావేశాల ద్వారా రూపొందించుకుంటామని ఆయన అన్నారు. 1999 నుంచి పార్టీసాధించిన ఓట్ల శాతాన్ని కూడా ఈ సమావేశాల్లో సమీక్షిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X