వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సజావుగా డిఎస్‌సి పరీక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం తలపెట్టిన డిఎస్‌సి పరీక్షలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. రెండు లక్షల 60 వేల పోస్టులకు గాను రెండు లక్షల 60 వేల మంది ఈ పరీక్ష రాస్తున్నారు. రాష్ట్రంలోని 1140 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. కృష్ణా, చిత్తూరు, రంగారెడ్డి జిల్లాల్లోమినహా రాష్ట్రమంతటా ఈ పరీక్షలు జిల్లతా కేంద్రాల్లో జరిగాయి. డిఎస్‌సి పరీక్ష చిత్తూరు జిల్లాలో తిరుపతిలో, కృష్ణా జిల్లాలోవిజయవాడలో, రంగారెడ్డి జిల్లాలో బిహెచ్‌ఇఎల్‌ టవున్‌ షిప్‌లో జరిగాయి.

అక్కడక్కడా కొన్ని అపశృతులు దొర్లినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు సజావుగానే జరిగాయి. పరీక్ష విధానంలో మార్పులపై అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లాలో 62 కేంద్రాల్లో పరీక్ష జరిగింది.అరకొర వసతులతో అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని చోట్ల లోకల్‌, నాన్‌ లోకల్‌ సమస్య కూడా తలెత్తింది.హాల్‌ టికెట్లలో తప్పులు దొర్లాయి. ఈ తప్పులను ఈ నెల 30వ తేదీన సరిచేస్తామని జిల్లా కలెక్టర్‌ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X