వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

27న ఎన్‌డిఎ సమావేశం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ కుంభకోణంలో తెహెల్కాసెక్స్‌ వర్కర్లను ఉపయోగించిన వివాదం నేపథ్యంలో సోమవారం ఇక్కడ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) పక్షాల సమావేశం జరుగుతుంది. తెహెల్కాసెక్స్‌ వర్కర్లను ఉపయోగించిన సంఘటనపైఅగ్గి మీద గుగ్గిలం అవుతున్న సమతా పార్టీని బుజ్జగించేందుకు బిజెపి ప్రయత్నాలు ప్రారంభించింది. ఉత్తర ప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా జార్జి ఫెర్నాండెజ్‌ను తిరిగి కేంద్ర మంత్రి వర్గంలో చేర్చుకునేవిషయంపై కూడా సోమవారంనాటి సమావేశంలో చర్చిస్తారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ను తిరిగి చేర్చుకునేవిషయం మీద కూడా చర్చ జరగవచ్చునని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలకు ముందు తెహెల్కావివాదం నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ ఎన్‌డిఎ నుంచి వెదొలిగినవిషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో కలిసి పశ్చిమబెంగాల్‌లో మమత పోటీ చేశారు. అయితే, వామపక్షాన్ని ఆమె ఓడించలేకపోయారు.అప్పటి నుంచి మమతా బెనర్జీ తిరిగి ఎన్‌డిఎలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X