వైయస్పై నాగం బుసబుసలు
హైదరాబాద్: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి హింసను ప్రేరేపిస్తున్నారని తెలుగుదేశం పార్టీవిమర్శించింది. కాంగ్రెస్కు పార్టీకి చెందిన యువకులు ముందుకు వచ్చి ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేసుకోవాలని రాజశేఖరరెడ్డి ఇచ్చిన పిలుపును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారంవిలేకరుల సమావేశంలో ఖండించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైతే కొంత మంది యువకులు ముందుకు వచ్చి ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేసుకోవాలని రాజశేఖర్ రెడ్డి శనివారం అనంతపురంలో పిలుపునిచ్చారు.
అనంతపురం
జిల్లా
యాడికి
మండలాధ్యక్షుడు
బాల
సతీష్
హత్యకు
నిరసనగా
జరిగిన
ప్రదర్శనలో
రాజశేఖరరెడ్డి
ఆ
పిలుపునిచ్చారు.
ముఠా
కక్షలకు
పెట్టింది
పేరయిన
కాంగ్రెస్
పార్టీ
నాయకులకు
ఆ
విధమైన
పిలుపునిచ్చే
నైతిక
హక్కు
లేదని
జనార్ధన్
రెడ్డి
అన్నారు.
కాంగ్రెస్
నాయకులు
హింసను
ప్రేరేపిస్తున్నారని
ఆయనవిమర్శించారు.
ఆత్మాహుతి
దళాలను
ఏర్పాటు
చేసుకోవాలంటున్న
రాజశేఖర
రెడ్డి
ఆ
దళాలను
తీవ్రవాదుల
రీతిలో
ఏర్పాటు
చేస్తారా
అని
ఆయన
ప్రశ్నించారు.