వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రోగ్రెస్‌ చూపిన శాఖలకే నిధులుః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పనితీరు ఆధారంగానే వివిధ ప్రభుత్వ శాఖలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 280 ప్రభుత్వ శాఖల పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒక సారి నివేదికలు తెప్పించుకొని, పనితీరు ఆధారంగా మాత్రమే నిధులు మంజూరు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పనితీరు సరిగాలేని శాఖలకు నిధులు మంజూరు చేసే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం నిర్వహించిన వర్క్‌ షాప్‌ లో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ వర్క్‌ షాప్‌ లో వివిధ శాఖలకు చెందిన అధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.

ప్రపంచబ్యాంక్‌ కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు ఈ వర్క్‌ షాప్‌ లో అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. అన్నివిధాలా పనితీరు సరిగా వున్న శాఖలకు మాత్రమే ప్రపంచబ్యాంకు రుణాలు లభిస్తాయని ఈ సందర్భంగా మాట్లాడిన ప్రపంచబ్యాంక్‌ అధికారి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X