వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర తీరు పట్ల కరువు పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కరువు సహాయంఅందించడంలో కేంద్ర తీవ్ర జాప్యం చేస్తోందని ఆయనవిమర్శించారు. ఈ విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు తానుసెప్టెంబర్‌ ఒకటవ తేదీన ఢిల్లీ వెళ్తున్నానని చంద్రబాబు చెప్పారు. కరువుతో రాష్ట్రం అల్లాడిపోతున్నా కేంద్రం ఒక్కపైసా సహాయం అందించలేదని ఆయన అన్నారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి నివేదిక సమర్పించి 20 రోజువులవుతున్నా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడం ఆశ్చర్యకరమని ముఖ్యమంత్రి ఆన్నారు.

కరువు సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 180 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, కేంద్రం నుంచి సహాయంఅందుతుందని ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. ఈవిషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు చెప్పినట్లు ఆయన తెలిపారు. కరువు ప్రాంతాల్లోని ప్రజలకు పని కల్పించేందుకు గృహ నిర్మాణ పనులను ఉపాధితో అనుసంధించాలని ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. నిబంధనలతో కరువు ప్రాంతాల్లోని ప్రజలకు సహాయంఅందించడంలో జాప్యం జరుగుతోందని, దీంతో ప్రజలువిసిగిపోతున్నారని, నిబంధనలను సరళీకృతం చేసి ప్రజలకు సహాయం అందేలా చూడడం అవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X