వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృషి వ్యవహారంపై బాబు స్పందన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కృషి కో ఆపరేటివ్‌అర్బన్‌ బ్యాంక్‌ వ్యవహారంపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. కృషి బ్యాంక్‌ డిపాజిటర్లను మోసం చేసినవిషయంపై చర్చించేందుకు ఆయన సోమవారం రిజర్వ్‌ బ్యాంక్‌, రాష్ట్ర సహకార శాఖ, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కృషి బ్యాంక్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన రెండు వారాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది. కృషి బ్యాంక్‌ వ్యవహారంతో ఐదు వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్న సహకార బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఇప్పటికే డిపాజిటర్లు సహకార బ్యాంక్‌ల నుంచి 20 శాతం డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. కృషి బ్యాంక్‌ వ్యవహారం నేపథ్యంలోఅర్బన్‌ బ్యాంక్‌లు మూత పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారులనుకోరారు.

కృషి బ్యాంక్‌ వ్యవహారంలో ఘరానా మోసగాళ్లను శిక్షిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ వ్యవహారంపై సమీక్ష జరపాల్సిందిగా రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారులకు తాను సూచించానని ఆయన చెప్పారు. కృషి బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ వేంకటేశ్వరరావు, ఇతర డైరెక్టర్లను పట్టుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. పోలీసులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశానని ఆయన అన్నారు. వారిని పట్టుకోవడంమీ సమర్థతకు పరీక్ష అని పోలీసులు అధికారులతో తాను అన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఇదిలా వుండగా, కృషి బ్యాంక్‌ వ్యవహారానికి రిజర్వ్‌ బ్యాంక్‌, రాష్ట్ర సహకార శాఖ కారణమనిఅర్బన్‌ బ్యాంకుల సంఘం విమర్శించింది. సహకార శాఖ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, రిజర్వ్‌ బ్యాంక్‌ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని,అందువల్ల కృషి బ్యాంక్‌ డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడడానికి రెండు ప్రభుత్వాలు ప్రయత్నించాలని సంఘం అన్నది. డిపాజిటర్ల సొమ్మును చెల్లించే విధంగా రెండు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తాము కొంత సొమ్ము సర్దుబాటు చేస్తామని సంఘం నాయకులు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X