వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏలో ఆయారాం....గయారాం!

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దినదిన గండం నూరేళ్ళు ఆయుష్షు అన్న చందంగా వున్న వాజ్‌పేయి సారధ్యంలోని ఎన్డీఏ సర్కార్‌ కు మళ్ళీ చిక్కు వచ్చిపడింది. కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా ఎన్డీఏ నుంచి వైదొలగుతానని బెదిరిస్తున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ లో ఘోరంగా ఓటమి పాలైన మమతా బెనర్జీ ఎన్డీఏ లో తిరిగి చేరేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ రభస చాలదన్నట్లు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన సమతా తెహల్కా మచ్చపడిన మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా ప్రధానిపై ఒత్తిడి తెస్తున్నారు.

ఈ వేడివేడి పరిణామాల మధ్య ఎన్డీఏ కీలక సమవేశం సోమవారం కొత్తఢిల్లీలో జరగనుంది. కాశ్మీర్‌ ఎన్నికలవిషయంలో ఎన్డీఏ నేతలు చేస్తున్న ప్రకటనల పట్ల కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా తీవ్ర మనస్తాపంతో వున్నారు. కాశ్మీర్‌ లో ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనేఅంశంపై ఎన్డీఏ నేతలు సందేహాలు వ్యక్తం చేయడంతో కినుక వహించిన ఫరూఖ్‌ ఎన్డీఏ తో తెగతెంపులు చేసుకొనేందుకు సిద్ధ పడ్డారు. ఫరూఖ్‌ కు నచ్చచెబుతానని ప్రధాని వాజ్‌పేయి ఆదివారం లక్నోలో ప్రకటించినప్పటికీ అది సాధ్యమయ్యేట్లు లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మరోవైపు పనిలేకుండా వున్న జార్జి ఫెర్నాండెజ్‌ ను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా సమతాపార్టీ నేతలు వాజ్‌పేయిని వేధించుకుతింటున్నారు. అదేవిధంగా మమతా బెనర్జీకి తిరిగి ఎన్డీఏలో చోటు కల్పించేవిషయంపై కూడా సోమవారం జరిగే ఎన్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X