వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌లో ముషారఫ్‌, వాజ్‌పేయిల భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: తానుసెప్టెంబర్‌ 19వ తేదీన భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిని న్యూయార్క్‌లో కలుసుకుంటానని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ ప్రకటించారు. ఆగ్రా శిఖరాగ్ర సమావేశంవిఫలమైన తర్వాత ఇరు దేశాల అధినేతల మధ్య జరిగే తొలి సమావేశం ఇదే అవుతుంది. తాము అన్నివిషయాలపై చర్చకు సిద్ధమేనని, అయితే కాశ్మీర్‌పై చర్చకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ముషారఫ్‌ చెప్పారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌అసెంబ్లీ, పాకిస్థాన్‌ ఏర్పాటు చేసిన పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ రాజధాని ముజఫరాబాద్‌లో ఏర్పాటు చేసిన కాశ్మీర్‌ కౌన్సిల్‌ సంయుక్త సమావేశంలో ఆయన ఈవిషయం చెప్పారు.

భారత ప్రధానికి తాము ఇప్పటికే ఆహ్వానం పంపామని, సమావేశంసెప్టెంబర్‌ 19వ తేదీన న్యూయార్క్‌లో జరుగుతుందని ఆయన చెప్పారు. ఆగ్రా శిఖరాగ్ర సమావేశం ఫలితం సాధించిందని, ఉమ్మడిఅంగీకారానికి కూడా వచ్చామని, అయితే భారత ప్రభుత్వంలోని అంతర్గత విభేదాల వల్లఅంగీకార పత్రంపై సంతకాలు జరగలేదని ఆయన అన్నారు.

కాశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాశ్మీర్‌ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉభయ దేశాల మధ్య ఏ రంగంలోనూ ప్రగతి సాధించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. కాశ్మీర్‌ సమస్యను కీలకాంశంగా గుర్తించినప్పుడే ప్రగతి సాధ్యమని ఆయన చెప్పారు. కాశ్మీర్‌ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పాకిస్థాన్‌ గానీ, భారత్‌ గానీ ప్రగతి సాధించలేవని, సంపద్వవంతం కాలేవని ఆయన అన్నారు.

ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి భారత బలగాలకు అధికారాలు ఇవ్వడాన్ని ఆయన ఖండిస్తూ ఇది అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని అన్నారు.స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడుతున్న కాశ్మీర్‌ ప్రజలకు పాకిస్థాన్‌ రాజకీయ, దౌత్య, నైతిక మద్దతు వుంటుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X