వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోతుపోలీస్టేషన్ పై వార్ మెరుపుదాడి
భువనేశ్వర్ఃఆంధ్రప్రదేశ్-ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దులో వున్న మల్కజ్ గిరి జిల్లా మోటు పోలీస్టేషన్ పైపీపుల్స్ వార్ నక్సలైట్లు సోమవారం తెల్లవారు జామున మరోసారి దాడిచేశారు. మోటు పోలీసుస్టేషన్పై నక్సల్స్ చేసి దాడిలో ప్రాణ నష్టం సంభవించలేదు. నాలుగు గంటల పాటు నక్సల్స్కు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నక్సల్స్ దాడిని పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారని డిజిపి చెప్పారు.
ఈ నెల 11న సుమారు 500 మంది నక్సలైట్లు మోటు పోలీస్టేషన్ పై దాడి నిర్వహించినవిషయం విదితమే.
రెండు వారాలలోపే నక్సలైట్లు మరోసారి మోటు పోలీస్టేషన్ పై మెరుపుదాడి చేయడంవిశేషం. గతంలో జరిగిన దాడిలో ఆరుగురు పోలీసులతో పాటుపీపుల్స్ వార్ ప్రముఖ నాయకుడు క్రాంతి రణదేవ్ మరణించారు.
Comments
Story first published: Monday, August 27, 2001, 23:53 [IST]