అపోహలపై అబ్దుల్లాతో జార్జి భేటీ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలపై ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి చేసిన ప్రకటనతో తలెత్తినఅపోహలను తొలగించడానికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాతో సమావేశం కానున్నారు.అపోహలను తొలగించాడానికి తాను ఫరూఖ్ అబ్దుల్లాతో సమావేశం అవుతున్నానని ఫెర్నాండెజ్ చెప్పడంతో ఆవిషయం సోమవారం రెండు గంటల పాటు జరిగిన ఎన్డిఎ సమావేశంలోపెద్ద చర్చకు రాలేదు. మంత్రి మృతి చెందడం వల్ల ఫరూఖ్ అబ్దుల్లా ఎన్డిఎ సమావేశానికిహాజరు కాలేదని ఫెర్నాండెజ్ చెప్పారు. అయితే, తాను సమావేశానికి రావడం లేదని ఫరూఖ్ అబ్దుల్లా ఆదివారం రాత్రే చెప్పారు.
నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున కేంద్ర మంత్రి ఒమర్ అబ్దుల్లాహాజరైనందున జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చర్చ జరగలేదని ఫెర్నాండెజ్ చెప్పారు. ఎన్డిఎలోని విభేదాలు తొలగిపోతాయని, ఇందులో ఏ విధమైన ఇబ్బంది ఏర్పడదని ఆయన అన్నారు.
జమ్మూ
కాశ్మీర్
ఎన్నికల్లో
రిగ్గింగ్
జరిగిందని
జాతీయ
నాయకత్వం
చేసిన
వ్యాఖ్యకు
ఆగ్రహం
చెందిన
అబ్దుల్లా
నేషనల్
కాన్ఫరెన్స్
ఎన్డిఎ
నుంచి
తప్పుకుంటుందని
బెదిరిచారు.
-
ఎన్డీఏలోఆయారాం....గయారాం!