కోట్లపై వెంకటస్వామి ధ్వజం
హైదరాబాద్: కాంగ్రెస్సీనియర్ నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎస్సి, ఎస్టిసెల్ జాతీయాధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి ధ్వజమెత్తారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావును పదవి నుంచి దించేందుకు కోట్ల ప్రయత్నిస్తున్నారని ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో విమర్శించారు. సత్యనారాయణరావును దించేందుకే పిసిసి కార్యవర్గం ఖరారు కాకుండా అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు.
గతంలోని కాంగ్రెస్(ఆర్) నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ నడిపిస్తున్నారని, ఇందిరా గాంధీని మోసం చేసినవారే ఇప్పుడు చక్రం తిప్పుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాయకులు చేస్తున్న మాయనుతాను ఇప్పుడు బహిరంగంగా ముందుకు తెచ్చానని ఆయన చెప్పారు. ఇంతకు ముందు ముగ్గురు పిసిసి అధ్యక్షులను తీయించావు, మరో ముగ్గురినిపెట్టించావు, పెట్టుడు నీ వంతే, తీసుడు నీ వంతేనా? అని తాను కోట్లవిజయభాస్కర్ రెడ్డిని ముఖం పట్టుకుని అడిగానని ఆయన చెప్పారు. కమాలుద్దీన్, రోశయ్య, మల్లికార్జున్ల కోవలోకి సత్యనారాయణరావును చేర్చేందుకు కోట్ల వర్గం ప్రయత్నిస్తోందని ఆయనవిమర్శించారు.