వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దాడిని తిప్పికొట్టినఒరిస్సాపోలీస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌ఃఒరిస్సా-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని పోలీస్టేషన్‌ లపైవిరుచుకు పడుతున్న పీపుల్స్‌ వార్‌ మంగళవారం రాత్రి వరుసగా మూడోసారి దాడికి పాల్పడింది. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు 200 మంది నక్సలైట్లుఒరిస్సా సరిహద్దులోని మల్కాన్‌ గిరి జిల్లా కలిమెల పోలీస్టేషన్‌ పై దాడి చేశారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఎదురు కాల్పులు జరిపారు.

పోలీసులు నక్సలైట్ల మధ్య సుమారు రెండు గంటలసేపు కాల్పులు జరిగాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న నక్సలైట్లు ఆ తరువాత సమీపంలోని దట్టమైన అడవుల్లోకి పారిపోయారని పోలీసు అధికారులు బుధవారం చెప్పారు. ఈ సంఘటనలో పోలీసులు ఎవరూ మరణించలేదని తెలిపారు. ఈ నెల 9 న కూడా నక్సలైట్లు మోతు పోలీస్టేషన్‌ పై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురుసీనియర్‌ కమాండర్ల దుర్మరణం పారయ్యారు. ఆ తరువాత నక్సలైట్లు అడవిలో 8 మంది తమ సహచరులకు అంత్యక్రియలు జరిపినట్లు సమాచారంఅందిందని పోలీసులు చెప్పారు. ఈ ఎన్‌ కౌంటర్‌ లో వార్‌సీనియర్‌ నాయకుడు క్రాంతిరణదేవ్‌ మరణించినవిషయం విదితమే.

ఆ ఎన్‌ కౌంటర్‌ కు ప్రతీకారంగానే నక్సలైట్లు మూడోసారి దాడి జరిపివుంటారని పోలీసులు భావిస్తున్నారు. నక్సలైట్ల కంటే పోలీసుల వద్ద అధునాతన ఆయుధాలు వుండడంతో వారి దాడిని తిప్పి కొట్టగలిగామనిఒరిస్సా పోలీసు అధికారులు వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X