వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాజీ మంత్రి రోడామిస్త్రీ లొంగుబాటు
హైదరాబాద్: పిల్లల అక్రమ దత్తత కేసులో ప్రధాన నిందితురాలైన మాజీ మంత్రి రోడామిస్త్రీ లొంగిపోయారు. ఆమె బుధవారం హైదరాబాద్ 9వ మెట్రోపాలిటన్ కోర్టు ముందు లొంగిపోయారు. గత 40 రోజులుగా ఆమె అజ్ఞాతంలో వున్నారు.
ఇరవైకిపైగా సెక్షన్ల కింద ఆమె అభియోగాలు నమోదయ్యాయి. ఆమెను కోర్టు 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఆమెపెట్టుకున్న బెయిల్ దరఖాస్తు గురువారం విచారణకు వస్తుంది. రోడామిస్త్రీ లొంగుబాటుతో పిల్లల అక్రమ దత్తత కేసులో నిందితులైన ఎనమండుగురిలో ఏడుగురు పోలీసుల చేతికి చిక్కినట్లయింది.
Comments
Story first published: Wednesday, August 29, 2001, 23:53 [IST]