వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏలూరు మా పనేః వార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఏలూరు రైల్వేస్టేషన్‌లో జరిగిన బాంబు పేలుడు సంఘటన మిస్టరీ వీడిపోయింది. రైల్వేస్టేషన్‌ పేలుడులో మరణించిన ముగ్గురిలో ఇద్దరు తమ పార్టీకి చెందిన వారేనని పీపుల్స్‌వార్‌ ప్రకటించింది. పార్టీ అవసరాలకోసం పేలుడు పదార్ధాలను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు అవి పేలినట్టుగా పీపుల్స్‌వార్‌ ప్రకటించింది.

సంఘటన జరిగిన స్థలం లభించిన ఆధారాలను బట్టి ఇదిపీపుల్స్‌వార్‌ ప్రమేయం వున్న సంఘటన అని పోలీసులు కూడా నిర్ధారించారు. మరణించిన ముగ్గురిలో తమ పార్టీ కార్యకర్తలువిజయభాస్కర్‌ అలియాస్‌ రమణ కర్నూలు జిల్లాసెంట్రల్‌ ఆర్గనైజర్‌గా వున్నాడని మరో కార్యకర్త సాగర్‌ గుంటూరు జిల్లాకు చెందిన దళ సభ్యుడనిపీపుల్స్‌వార్‌ పేరుతో విడుదలైన ఒక ప్రకటన వెల్లడించింది. మరో మృతుడు ఏలూరుకు చెందిన రాంబాబు అని పోలీసులు ప్రకటించారు. సంఘటన స్థలంలో పోలీసులకు 63 వేల రూపాయల నగదు, రెండు పిస్టళ్లు, హేండ్‌ గ్రేనెడ్‌లభ్యమయ్యాయి.

ఏలూరుగుండెల్లో పేలుళ్ళు!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X