గంగూలీనే వరించిన కెప్టెన్సీ
ముంబయ్ః బ్యాట్స్ మెన్గా, కెప్టెన్ గా పుట్టెడు వైఫల్యాలు మూటగట్టుకున్నప్పటికీ సౌరభ్ గంగూలీనే తిరిగి కెప్టెన్సీ వరించింది. ఈ నెలాఖరి నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టూర్ కు గంగూలీకి కెప్టెన్సీ పగ్గాలుఅప్పగిస్తున్నట్లు చందూ బోర్డే సారధ్యంలోనిసెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది.
సెప్టెంబర్ 24 నుంచి నవంబర్ 28 వరకు జరిగే సౌతాఫ్రికా టూర్ కు గంగూలీనే కెప్టెన్ చేయాలని బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు జయంత్ లెలెవిలేకరులకు చెప్పారు. సచిన్ టెండుల్కర్ తరువాత కెప్టెన్అయిన గంగూలీ సారధ్యంలో భారత్ జట్టు 45 వన్డేలు ఆడింది.అందులో 23 వన్డేల్లో భారత్ గెలుపొందగా 22 మ్యాచ్ లలో పరాజయంపాలైంది. గంగూలీ సారధ్యంలో 11 టెస్టులు ఆడిన భారత్ ఆరింటిలో గెలుపొందగా నాలిగింటిలో పరాజయంపాలైంది. ఒక మ్యాచ్ డ్రా అయింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు లేనప్పటికీ శ్రీలంక టూర్ లో గంగూలీ చెప్పుకోతగ్గ ప్రతిభ కనబరిచాడని బోర్డు అభిప్రాయపడింది.
శ్రీలంక టూర్ లో భారత్ బ్యాట్స్ మెన్, బౌలర్లు అన్ని రంగాల్లోవిఫలం అయ్యారని, భారత్ ఓటమికి అదే కారణం అని భారత్ కోచ్జాన్ రైట్ అన్నారు. సౌతాఫ్రికా టూర్ కు శుక్రవారం జట్టును ఎంపిక చేస్తారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, అనిల్ కుంబ్లే,వివిఎస్ లక్ష్మణ్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ లు తమ ఫిట్ నెస్ నిరూపించుకున్నారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు జట్టులో చేరడంతో సౌతాఫ్రికా టూర్ కు మంచి జట్టును పంపేందుకుసెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తున్నది.