వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్యోతిషం కోర్సుకు ఉస్మానియా రెడీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః జాతీయ విద్యావిధాన పత్రాన్ని కనీసం చదవని వారువిద్య కాషాయీకరణ జరుగుతున్నదంటూ గగ్గోలు పెట్టడంఅర్థరహితం అని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి మురళీ మనోహర్‌ జోషివిమర్శించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య సారధ్యంలో ఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశంలోవిద్య కాషాయీకరణ జరిగిపోతున్నదంటూ ఆందోళన వ్యక్తం చేయడం విడ్డూరమని జోషి గురువారం హైదరాబాద్‌ లో జరిగినవిలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

జాతీయ విద్యావిధానాన్ని చదివిసరైన సూచనలు చేయాల్సిందిగా రాష్ట్రాలకు నాలుగు సార్లు పంపినా ఒక్కరు కూడా నోరు మెదపకుండా ఇప్పుటు ఇలా విమర్శించడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిజానిజాలు తెలుసుకోకుండావిద్య కాషాయీకరణ అంటూ విమర్శించడం భావ్యం కాదన్నారు.
జ్యోతిషాన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టడంపై ఎటువంటి నిర్బంధం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌ లోని ఉస్మానియావిశ్వవిద్యాలయం కూడా జ్యోతిషం కోర్సు ప్రవేశపెట్టేందుకు ఆసక్తి కనబరచిందని ఆయన అన్నారు.

దేశంలో సుమారు 40 సంస్థల్లో జ్యోతిషాన్ని బోధిస్తున్నారని, న్యాయమూర్తులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు కూడా ఈవిద్యను నేర్చుకుంటున్నారని జోషి చెప్పారు. జోతిషాన్నికోర్సుగా ప్రవేశపెట్టడంపై ఇంత రాద్ధాంతం చేయడంవిచారకరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X