వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోట్లకు సోనియాగాంధీ పరామర్శ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కాంగ్రెస్‌ పార్టీ నేత సీనియర్‌ నేత కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ గురువారం నాడుపరామర్శించారు.

గురువారం నాడు ఉదయం ఇండియన్‌ఎయిర్‌లైన్స్‌ విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న సోనియా గాంధీవిమానాశ్రయం నుంచి నేరుగా కోట్ల చికిత్స పొందుతున్నఅపొలో ఆస్పత్రికి వెళ్లారు. కోట్లను ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పుష్పగుచ్ఛాన్ని ఆయనకుఅందజేశారు.

తనను పరామర్శించేందుకు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ నేతకు కోట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. సోనియాతో కోట్ల కొద్దిసేపు పార్టీ వ్యవహారాలను గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుసింది. కోట్లను పరామర్శించిన అనంతరం సోనియా నేరుగావిమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఉదయం ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఆమెకు పిసిసి నేత సత్యనారాయణరావు, సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాజీ కేంద్ర మంత్రివెంకటస్వామి స్వాగతం చెప్పారు.

క్రమశిక్షణారాహిత్యంపై ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణారాహిత్యంపై సోనియా గాంధీ ఆందోళన వ్యక్తంచేశారని ఆమెకు వీడ్కోలు పలికిన అనంతరం విలేకరులతోమాట్లాడిన ఎమ్మెస్సార్‌ చెప్పారు. కోట్లను పరామర్శించినఅనంతరం సోనియా గాంధీ విమానాశ్రయంలో ఎమ్మెస్సార్‌,వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి, వెంకటస్వామితో కొద్దిసేపు చర్చలు జరిపారు.

ఉయ్యారు, సిద్దిపేట ఉపఎన్నికల అనంతరం రాష్ట్రంలోపర్యటించేందుకు సోనియా సమ్మతించారని ఎమ్మెస్సార్‌చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ విధానాలకువ్యతిరేకంగా అవసరమైతే ఆత్మాహుతి దళాలుగాఏర్పడాలంటూ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి గతంలోచేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయంవిదితమే. ఈ వ్యాఖ్యలను సోనియా సమర్థించారనిఎమ్మెస్సార్‌ ఈ సందర్భంగా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X