చర్చలతోనే కాశ్మీర్కు మోక్షంఃవాజ్పేయి
న్యూఢిల్లీః
చర్చల
ద్వారా
మాత్రమే
కాశ్మీర్
సమస్యకు
పరిష్కారం
సాధ్యమని
వాజ్పేయి
అన్నారు.
భారతదేశంలో
శాంతికి
తూట్లు
పొడిచేపర్వాన్ని
కొనసాగిస్తున్నప్పటికీ
పాకిస్తాన్
తో
చర్చలు
కొనసాగిస్తామని
ప్రధాని
వాజ్పేయి
అన్నారు.
వివిధ
రాష్ట్రాల
పోలీసు
ఉన్నతాధికారుల
సమావేశంలో
గురువారం
ఆయన
ప్రసంగించారు.
ఆగ్రా
సదస్సు
సత్ఫలితాలు
సాధించనప్పటికీ
ద్వైపాక్షిక
సమస్యలను
పరిష్కరించేందుకు
చర్చల
ద్వారానే
ముందుకు
పోవాలని
నిర్ణయించినట్లు
వాజ్పేయి
చెప్పారు.
కాశ్మీర్
తో
సహా
అన్ని
సమస్యలను
పాకిస్తాన్
తో
చర్చలు
జరపడం
ద్వారా
మాత్రమే
పరిష్కరించాలనేది
తమ
అభిమతమని
ప్రధాని
చెప్పారు.ఈశాన్య
రాష్ట్రాలలో
శాంతి
స్థాపనకు
కేంద్రం
ఇతోధికంగా
కృషి
చేస్తున్నదని
ఆయన
చెప్పారు.
బోడో
వంటి
తీవ్రవాద
సంస్థలతో
జరుపుతున్న
చర్చలు
సత్ఫలితాలిస్తున్నాయని
వాజ్పేయి
చెప్పారు.
అభివృద్ధి
పథకాలను
ముమ్మరంగాచేపట్టడం
ద్వారా
ఈశాన్య
రాష్ట్రాలలో
శాంతి
సాధనకు
కృషి
చేస్తామని
ఆయన
చెప్పారు.