వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవుసాయంపైశ్వేతపత్రానికి డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కరవు ప్రాంతాల్లో సత్వరం సహాయ చర్యలు తీసుకోవలసిందిగా కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడు వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పలు జిల్లాలు అనావృష్టితో అల్లాడి పోతుంటే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలతో కాలం వెళ్ళదీస్తున్నారని ఆయన గురువారం జరిగినవిలేకరుల సమావేశంలో విమర్శించారు. కేంద్రం నుంచి తగిన రీతిలో కరవు సాయం తెచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగావిఫలం అయ్యారని ఆయన దుయ్యబట్టారు.

కరవు సాయంపై ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతున్నదని ఆయనవిమర్శించారు. కరవు సాయంపై తక్షణం శ్వేతపత్రాన్ని ప్రకటించాల్సిందిగా ఆయన డిమాండ్‌ చేశారు.

గురువారం హైదరాబాద్‌ వచ్చిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆంధ్రలో నెలకొన్న కరవు పరిస్థితినివివరించినట్లు వై.ఎస్‌. చెప్పారు. కరవు ప్రాంతాల్లో పర్యటించేందుకు సోనియా సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయనవివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో వేరుగా కూర్చోనున్నట్లు గతంలో ప్రకటించిన తెలంగాణా కాంగ్రెస పార్టీ నేతలు తమ వైఖరి మార్చుకున్నారని వై.ఎస్‌. ఈ సందర్భంగా ప్రకటించారు. అధిష్టానం ఇచ్చిన హామీపై నమ్మకం వుంచిన తెలంగాణా కాంగ్రెస్‌ ఎమ్మెల్ల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.

మరిన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలుః
కరవు, ఏలేరు వంటి కీలకవిషయాలు చర్చించేందుకు ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యేఅసెంబ్లీ వర్షాకాల సమావేశాలను మరికొంత కాలం పొడిగించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. సి.ఎల్‌.పి. కార్యదర్శిఎం.పి. మైసూరా రెడ్డి ఈ మేరకు గవర్నర్‌ రంగరాజన్‌ కు వినతి పత్రం సమర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X