వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః అమెరికాలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమం ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన పలువురి గుండెల్లోరైళ్ళు పరిగెత్తిస్తున్నది. అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీ, వాషింగ్టన్‌ ప్రాంతాల్లో వుంటున్న, పనిచేస్తున్న తెలుగువారి యోగక్షేమాల గురించి వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.

తమవారికి ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఇంటర్నెట్‌ద్వారా వారి యోగక్షేమాలు కనుగొన్నారు. అవకాశంవున్న వారు చాట్‌ ద్వారా అమెరికాలో వుంటున్న తమవారి గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే పెనువిధ్వంసం కారణంగా అమెరికాలు ఇంటర్నెట్‌ నెమ్మదిగాపనిచేయడం, ఫోన్‌ లైన్లు పనిచేయకపోవడంతోపలువురు ఆందోళన పడుతున్నారు.

అమెరికాలో బంధువులు వున్న వారంతా ఇక్కడటి.వి.లకు అతుక్కొని పోయారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌భవనం ఇంగ్లీష్‌ సినిమాలో మాదిరిగా పేకమేడలోకూలిపోవడం.... పెంటగాన్‌ మంటల్లో చిక్కుకోవడంవంటి దృశ్యాలు వారి ఆందోళనను మరింత అధికంచేస్తున్నాయి.

వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ పై దాడి జరగడానికి కొద్దిసేపటి వరకు తాను అక్కడే వున్నానని ఓ ప్రవాసభారతీయుడుచెప్పాడు. న్యూజెర్సీ నుంచి వెళ్ళి న్యూయార్క్‌లో పనిచేసే బంధుమిత్రుల యోగక్షేమాలగురించి తెలుగునేలకు చెందిన వేలాదికుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

సంబంధితవార్తలుః

  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X