ప్రతీకారం తీర్చుకుంటాం: బుష్
వాషింగ్టన్: న్యూయార్క్,పెంటగాన్లపై దాడులకు పాల్పడిన టెర్రిరిస్టులపనై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్ అన్నారు. న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్సెంటర్పై, పెంటగాన్పై జరిగి దాడుల్లో వేలాది మంది మరణించినట్లు ఆయన మంగళవారం చెప్పారు. దాడుల తర్వాత ఆయన ఐదు నిమిషాల పాటు ఆయన టెలివిజన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. టెర్రరిస్టుల కిరాతక చర్యకు వేలాది మంది ప్రాణాలు బలయ్యాయని ఆయన అన్నారు. ఆయన ముఖం వాడిపోయి వుండడం ప్రపంచ ప్రజలు గమనించారు. దాడులకు పాల్పడినవారికి, వారికి ఆశ్రయం ఇచ్చినవారికి మధ్య అమెరికా ఏ విధమైన తేడా చూపబోదని ఆయన చెప్పారు.
అమెరికా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఈ సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారని బుష్ అన్నారు. అయితే వారు ఇందులోవిఫలమయ్యారని, తమ దేశం బలంగా వుందని ఆయన అన్నారు. అమెరికా ఉక్కు సంకల్పాన్నిదెబ్బ తీయడంలో దాడులు విఫలమయ్యాయని ఆయన అన్నారు.
ఈ దాడుల వెనుక గల శక్తులను గుర్తించడానికి అన్వేషణ జరుగుతోందని ఆయన చెప్పారు. తమసైన్యం శక్తివంతమైందని, సైన్యం సర్వసన్నద్ధంగా వున్నదని ఆయన అన్నారు.
పరికిపందలు
ప్రజాస్వామ్యంపై
దాడి
చేశారని,
దీనికి
బాధ్యులయినవారిని
వేటాడి,
వారిని
శిక్షిస్తామని
బుష్
జాతీయ
భద్రతా
మండలికి
విడుదల
చేసిన
ప్రకటనలో
అన్నారు.
వారిని
గుర్తిస్తాం.
ఈ
పరిణామానికి
తగిన
ఫలితం
వారు
అనుభవిస్తారు
అని
ఆయన
అన్నారు.
ప్రభుత్వ
కార్యకలాపాలు
నిరాంటంకంగా
కొనసాగుతున్నాయని,
మంగళవారం
ఖాళీ
చేసిన
ఫెడరల్
ఏజెన్సీలు
బుధవారం
తెరుచుకుంటాయని
ఆయన
చెప్పారు.
అమెరికాపై
దాడులకు
ఒసామా
బిన్
లాడెన్
బాధ్యుడని
అమెరికాసెనేటర్,
పేరు
చెప్పడానికి
ఇష్టపడని
అధికారి
ఒకరుఅన్నారు.
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికా అగ్నిగుండమైన క్రమం...
- ముందే హెచ్చరించిన లాడెన్
-
అమెరికాలోటెర్రరిస్టుల
బీభత్సం