వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కలసికట్టుగా కరవుపై పోరు
హైదరాబాద్ః రాష్ట్రంలో నెలకొన్న కరవుపై ఉమ్మడిగా పోరాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం నాడు మహబూబ్నగర్ జిల్లా ఉట్నూరులో ఆయన పర్యటించారు.
జిల్లాలో నెలకుని వున్న కరవు పరిస్థితిని ఆయనస్వయంగా పరిశీలించారు. ఎండిపోయిన చెరువులు, బీళ్లుగా మారిన పొలాలను చూశారు. రైతులకు సబ్సిడీ విత్తనాలుఅందజేశారు. కరవు సాయం కోసం కేంద్రంతో పోరాడి నిధులు తేనున్నట్టుగా ఆయన చెప్పారు. కేంద్రం, రాష్ట్రం, ప్రజలు సంయుక్తంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కరవు సాయ చర్యలు ప్రజలకు అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను హెచ్చరించారు. కరవు బాధిత రైతులను ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన ప్రజలకువివరించారు.
Story first published: Wednesday, September 12, 2001, 23:53 [IST]