గాడాంధకారంలో ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ః
దక్షిణాది
పవర్
గ్రిడ్విఫలం
కావడంతో
మంగళవారం
మధ్యాహ్నం
నుంచి
సుమారు
పదిగంటల
పాటు
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం
యావత్తు
అంధకారంలో
చిక్కుకుంది.
ఆంధ్రప్రదేశ్
తో
పాటు
కర్నాటకకూడా
అంధకార
బంధురమైంది.
మధ్యాహ్నం
12.55
నిముషాలకు
రాష్ట్రమంతటా
ఒక్కసారిగా
పవర్
పోయింది.
హైదరాబాద్
లో
అర్థరాత్రి
సమయానికివిద్యుత్
పునరుద్ధరించగలిగారు.
బుధవారం
ఉదయానికి
రాష్ట్రంలోని
ప్రధాన
పట్టణాలలోవిద్యుత్
ను
పునరుద్ధరించ
గలిగారు.
వైజాగ్పరిసర ప్రాంతాల్లో మాత్రం కరెంటు వుంది.కరెంట్ పోవడంతో రాష్ట్రంలో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. రామగుండంలోని ఎన్.టి.పి.సి.లో 1600మెగావాట్ల అయిదు యూనిట్లు ట్రిప్ అయ్యాయి. తమిళనాడునుంచి, తూర్పుగ్రిడ్ నుంచి 50 మెగావాట్ల విద్యుత్తెప్పించుకొని జనరేటింగ్ స్టేషన్లు ప్రారంభించేందుకుఅవసరమైన విద్యుత్ ఇచ్చారు. కరెంట్ లేకపోవడంతోదక్షిణమధ్య రైల్వేకు చెందిన పలు రైళ్ళుఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీనితో ప్రయాణికులుతీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్,
కర్నాటకతో
పాటు
తమిళనాడులోకూడా
విద్యుత్
సరఫరాకు
అంతరాయం
ఏర్పడింది.అయితే
ప్రత్యేక
సాంకేతిక
ప్రతిపత్తి
తో
గంటలోపేవిద్యుత్
ను
పునరుద్ధరించుకోగలిగింది.