ఏ క్షణంలోనైనాఅఎn్గాన్పై దాడి
న్యూయార్క్ః ప్రతీకార జ్వాలల్లో రగిలిపోతున్న అమెరికా ఏ క్షణంలోనైనా అఎn్గానిస్తాన్లో ఒసామా బిన్లాడన్ శిబిరాలపై దాడి చేసే అవకాశం వున్నదన్న వార్తలు ప్రపంచమంతా వినవస్తున్నాయి.
అమెరికా కూడా ప్రపంచవ్యాప్తంగా వున్న తన బలగాలను అప్రమత్తం చేసింది. అదే సమయంలో తమపై దాడులకు పాల్పడితే పరిస్థితి తీవ్రంగా వుంటుందని తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. మరో వైపు అఎn్గాన్లోని బిన్లాడన్ శిబిరాలపై దాడులకు వీలుగా పాకిస్తాన్ విమానాశ్రయాలను, గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతినివ్వాల్సిందిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అమెరికా ఇప్పటికే కోరింది. అయితే దీనిపై పాకిస్తాన్ కొంత గడవు కోరింది.
ఆలోచించి తమ నిర్ణయం వెల్లడిస్తామని చెప్పింది. అదే సమయంలో అఎn్గానిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకోమన్న అమెరికా అభ్యర్ధనను మాత్రం పాక్ పట్టించుకోలేదు. ఉభయదేశాల మధ్య సంబంధబాంధవ్యాలు యథవిధిగా సాగుతున్నాయి. టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో తమకు సహకరిస్తామని పాకిస్తాన్ ఇస్తున్న హామీలను నమ్మే ఉద్దేశ్యంలో అమెరికా వున్నట్టుగా కనిపించడంలేదు. అఎn్గాన్పై తాము జరిపే దాడులకు సహకరిస్తారా లేదా సూటిగా తేల్చిచెప్పాలని పాకిస్తాన్పై అమెరికా వత్తిడి తెస్తున్నది.
టెర్రరిస్టులపై
అమెరికా
యుద్ధానికి
పూర్తి
మద్దతు
ఇవ్వనున్నట్టుగా
బ్రిటన్
ప్రకటించింది.
బ్రిటన్
ప్రభుత్వం
శుక్రవారం
నాడు
అత్యవసర
సమావేశం
జరిపి
తాజా
పరిస్థితిని
సమీక్షించారు.
ఆస్ట్రేలియా
కూడా
అమెరికా
యుద్ధానికి
పూర్తి
మద్దతు
ప్రకటించింది.
ఇదిలా
వుండగా
న్యూయార్క్,
పెంటగాన్పై
దాడికి
ఉపయోగించిన
విమానాల
బ్లాక్బాక్స్లను
ఎఫ్బిఐ
స్వాధీనం
చేసుకున్నది.
మరో
ఎనిమిది
మంది
అరబ్బు
జాతీయులను
అరెస్టు
చేశారు.
సంబంధిత
వార్తలుః
- గుట్టలు గుట్టలుగా శవాలు
- 50 మందిని గుర్తించిన ఎఫ్బిఐ
- సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
- ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
- ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం