యుద్ధానికి సిద్ధం: బుష్
వాషింగ్టన్: ఉగ్రవాద తండాలపై భీకర యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్ చెప్పారు. ఈ యుద్ధాన్ని ఆయన 21వ శతాబ్ది తొలి యుద్ధంగా అభివర్ణించారు. ఈ యుద్ధంలో తామువిజయభేరి మోగిస్తామని ఆయన అన్నారు.
వైమానిక దాడులతో పాటు భూతల యుద్ధానికి కూడా అమెరికా సన్నద్ధమవుతోంది. తమ యుద్ధం ఎవరిమీద ప్రకటించబోతున్నారనేది అమెరికా వెల్లడించలేదు. అయితే, అమెరికా తన గురినిఅఫ్ఘనిస్తాన్ మీదనే పెట్టిందనేది పరిణామాలను బట్టిఅర్థమవుతోంది. అఎn్గాన్ పొరుగు దేశాలయిన చైనా, పాకిస్తాన్లతో అమెరికా చర్చలు జరిపింది. అమెరికా అధ్యక్షుడు బుష్ చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్తో టెలిఫోన్లో సంభాషించారు. నాటో కూటమి దేశాల నేతలతో కూడా ఆయన మాట్లాడారు. అమెరికాస్పెషల్ ఫోర్స్ తన భూభాగంపై మోహరించేందుకు తజకిస్థాన్అంగీకరించింది.
లాడెన్పై దాడికి పాకిస్థాన్ ఉత్తర భూభాగంలో తమ రహస్య బలగాలను మోహరించేందుకు వెసులుబాటు కల్పించాలని అమెరికా కోరింది. అయితే ఈవిజ్ఞప్తిని పాక్ తిరస్కరించింది. ఇస్లామాబాద్లోని అమెరికా రాయబారి వెండీ చాంబర్లీన్ అమెరికా అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ను కలిశారు. బుష్ సందేశాన్ని ఆమెపర్వేజ్కు అందజేశారు. తీవ్రవాదంపై పోరాటంలో అమెరికాకు తాము పూర్తి సహకారాన్నిఅందిస్తామని ముషారఫ్ హామీ ఇచ్చారు.
దాడులకు బాధ్యులెవరు, అమెరికా కార్యాచరణ ఏమిటి అనేది వెల్లడించడానికి బుష్ నిరాకరించారు. తాము 21వ శతాబ్ది తొలి యుద్ధాన్ని చవి చూశామని, తీవ్రవాదంపై పోరాటంలో తాము ప్రపంచాన్ని గెలిపిస్తామని ఆయన అన్నారు.
సంబంధితవార్తలుః
- గుట్టలు గుట్టలుగా శవాలు
- 50 మందిని గుర్తించిన ఎఫ్బిఐ
- సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
- ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
- ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం