కరవుపై కళ్ళుమూసుకున్న సర్కార్ఃవైఎస్
హైదారాబాద్ః
రాష్ట్రంలో
దాదాపు
అన్ని
జిల్లాలు
కరవు
కోరల్లో
చిక్కుకొని
విలవిలలాడుతుంటే
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడికి
గాని,
తెలుగుదేశం
ప్రభుత్వానికి
కానీ
కరవు
కనిపించడం
లేదని
వై.ఎస్
రాజశేఖర
రెడ్డి
విమర్శించారు.
రాష్ట్రంలో
తీవ్రమైన
కరవు
పరిస్థితులు,
రైతుల
ఆత్మహత్యలు
ప్రభుత్వాన్ని
కదిలించ
లేకపోయాయని
ఆయన
కరవుపై
అసెంబ్లీలో
చర్చ
ప్రారంభిస్తూ
అన్నారు.
వివిధ జిల్లాలలో పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..... పశువులు తినేందుకు గడ్డి లేక అల్లాడి పోతున్నాయి. కొన్ని జిల్లాల్లో తాగేందుకు గుక్కెడు మంచి నీళ్ళు కూడా కరువయ్యాయని వై.ఎస్. ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా వున్నదన్నారు. రాష్ట్రం కరవుతో ఇంతగా అల్లాడుతుంటే నాలుగురోజుల కిందట జరిగిన క్యాబినెట్ సమావేశంలో కనీసం కరవువిషయం ప్రస్తావనకు కూడా రాకపోవడం ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధి తెలియజేస్తున్నదనివిమర్శించారు.
గంటల తరబడి, ప్రజాధనాన్ని వెచ్చించి క్యాబినెట్ సమావేశం జరిపారు. అన్ని గంటల సమయంలో కరవు గురించి కనీసం చర్చించకపోవడం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కరవుమీ కంటికి అంత చిన్న విషయంగా కనిపిస్తున్నదా అని ఆయన అడిగారు. మన నిధులు ఖర్చు చేయకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖర్చు చేయడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ఇచ్చిన నిధులను తాను మంజూరు చేసుకుంటున్నట్లు గా చెప్పుకుంటున్నారే తప్ప చంద్రబాబు నాయుడు కరవు నివారణకు ఇచ్చిన నిధులు నామమాత్రమేనని ఆయనఅన్నారు.
స్పాట్లైట్ః ఆంధ్ర అసెంబ్లీ స్పెషల్