అమెరికాకు భారత్ బాసట
న్యూఢిల్లీః ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజంపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని భారత ప్రధాని వాజ్పేయి అన్నారు. అమెరికా దాడుల నేపథ్యంలో శుక్రవారం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన టెలివిజన్లో ప్రసంగించారు.
ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టుల శిక్షణ కేంద్రాలపై, వారికి ఆశ్రయం ఇస్తున్న దేశాలపై దాడులు ఎక్కుపెట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పారు. పాకిస్తాన్,అఎn్గానిస్తాన్ పేరు నేరుగా ప్రస్తావించకుండా కొన్ని పొరుగు దేశాలు ఉగ్రవాదులకు అండగా వున్న కారణంగా భారత్ తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కుంటున్నదని వాజ్పేయి అన్నారు. అమెరికా దాడుల దరిమిలా భారత్లోని వేలాది కుటుంబాలు తమ ఆప్తుల క్షేమం కోసం ఆ బాధను ఆవేదనను అనుభవించాయని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ ఉగ్రవాదంపెనుసవాలును విసురుతున్నదని ఆయన చెప్పారు. తాము అమెరికా నేతలతో అనుక్షణం సంప్రదిస్తున్నామని వారికి అవసరమైన సాయంఅందజేస్తామని చెప్పామని ప్రధాని వెల్లడించారు.
గడ్డు కాలానికి సిద్ధంకండి
అమెరికాలో టెర్రరిస్టులు జరిపిన దాడుల ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర స్థాయిలో వుండే అవకాశం వున్నదని ప్రధాని వాజ్పేయి హెచ్చరించారు. ఈ ప్రభావాన్ని తట్టుకునేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవల్సివుంటుందని ఆయన చెప్పారు. శుక్రవారం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన టెలివిజన్లో ప్రసంగించారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో మన ఎగుమతులు మందగించే అవకాశం వున్నదని అదే సమయంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గే అవకాశం వున్నదని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయాలకు దేశ ప్రజలు సన్నద్ధంగా వుండక తప్పదని ప్రధాని అన్నారు.
సంబంధిత వార్తలుః
- గుట్టలు గుట్టలుగా శవాలు
- 50 మందిని గుర్తించిన ఎఫ్బిఐ
- సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
- ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
- ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం